గ్రేట్ ఇండియన్ కాంగ్రెస్ తమాషా మరోసారి బయటపడింది. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ వ్యవహారాలను చూస్తుంటే..ఒక్కోసారి చాలా గందరగోళంగా… తిక్కతిక్కగా…జనాలను…వెర్రి
వెంగలప్పలను చేసేలా ఉంటాయి. జగన్ లక్ష్య దీక్ష చూస్తే నాకదే అనిపించింది.
గ్రేట్ ఇండియన్ కాంగ్రెస్ తమాషా మరోసారి బయటపడింది. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ వ్యవహారాలను చూస్తుంటే..ఒక్కోసారి చాలా గందరగోళంగా… తిక్కతిక్కగా…జనాలను…వెర్రి
వెంగలప్పలను చేసేలా ఉంటాయి. జగన్ లక్ష్య దీక్ష చూస్తే నాకదే అనిపించింది.
రాజకీయ వ్యవస్థను, శాసనవ్యవస్థను ప్రజలు పెద్దగా విశ్వసించకపోయినా… న్యాయవ్యవస్థపై మాత్రం కొద్దో గొప్పో గౌరవంతోనే ఉంటారు. న్యాయదేవతకళ్లకు గంతలు కట్టినా…ఏదో ఓ స్థాయిలో న్యాయం జరుగుతుందన్న ఆశ ప్రజలకు ఉంటుంది. న్యాయమూర్తులు అనగానే చెప్పలేని గౌరవం కూడా వస్తుంది. అయితేఎన్నో లోపాలు కనిపించినా భారతీయ న్యాయవ్యవస్థ ఉన్నతంగానే వ్యవహరిస్తూ వస్తోంది.అయితే తమిళ తంది రాజా అంటించిన స్పెక్ట్రం చిచ్చు అన్ని వ్యవస్థలమూలాలను కుదిపే స్థాయికి వచ్చింది. నీరారాడియా టేపుల ద్వారా కార్పోరేట్లాబీయింగ్లో మీడియా చిక్కుకోవడం విస్మయాన్ని కలిగిస్తే…అదే రాజా వ్యవహారంలో దేశ అత్యున్నత న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూసరికొత్త వివాదానికి తెరలేపారు.
అద్భుతం…మహాద్భుతం..గ్రేట్ ఇండియన్ తమాషా….ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని పనిని మనవాళ్లు చేసి చూపించారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పార్లమెంటరీప్రజాస్వామిక వ్యవస్థకు సరికొత్త అర్థాన్ని చెప్పారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ భవిష్యత్తులో తన ఉనికిని కాపాడుకోగలదా….? ఈ సందేహం వచ్చింది ఎవరికో కాదు…సాక్ష్యాత్తూ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి. అవును. ఆయన ఈ స్థాయిలో భయాందోళనలు వ్యక్తం చేయడానికి కారణాలు లేకపోలేదు. View full article »
సెల్ఫోన్లో వచ్చిన మెసెజ్ చూసుకొని ఎవరైనా ఫక్కున నవ్వారంటే…ఖచ్చితంగా ఆ మెసెజ్ సర్దార్పైనే అయి ఉంటుంది. సాధారంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఫార్వర్డ్ అయ్యే సంక్షిప్త సందేశాల్లో నవ్వు పుట్టించే సర్దార్ సందేశాలే ఎక్కువగా ఉంటాయి. ఎలా పుట్టిందో తెలియదు….ఎందుకు పుట్టిందో తెలియదు..ఎవరు పుట్టించారో తెలియదు… మనం నవ్వుకోవడం కోసంమనలో ఒకడైన సర్దార్ను వెర్రి వెంగళప్ప చేసి… SMSల రూపంలో పంపిస్తూ ఉంటాం.
రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులందరం కలిసి కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం వెళ్లాం. ఘాట్ రోడ్డు నుంచి కృష్ణానది అందాల వరకూ …ప్రకృతి అందాలను చూసి పులకించిపోయాను. అయితే
ఓ విషయంలో మాత్రం నేను తీవ్రంగా బాధపడ్డాను. చెబితే చాలా మందికి అదో విషయమా అని అనిపించవచ్చు…
రాష్ట్రంలో కొత్త కేబినెట్ కొలువుతీరిన కొన్ని గంటలకే ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి అసంతృప్తుల సెగ తాకింది. అత్యంత రహస్యంగా కేబినెట్ను రూపొందించిన కిరణ్కు తొలి కేబినెట్ భేటీ జరగకముందే మంత్రులు షాక్ ఇచ్చారు. శాఖలు కేటాయించిన కొన్ని గంటలకే అసంతృప్తి జ్వాలలు తారాస్థాయికి చేరాయి.
దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఓ జర్నలిస్ట్…తనపై వచ్చిన ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతూవాటిపై వివరణ ఇచ్చుకునేందుకు తాను పనిచేస్తున్న టెలివిజన్ ఛానల్లోనే చర్చా కార్యక్రమం నిర్వహించాల్సిన పరిస్థితి….దేశ చరిత్రలో బహుశా ఇప్పటి వరకూ ఎవరికీ వచ్చి ఉండకపోవచ్చు. కానీధైర్యసాహసాలతో కూడిన రిపోర్టింగ్కు పెట్టిందిపేరైన బర్ఖాదత్కు ఆ పరిస్థితే వచ్చింది. View full article »