ఇటు భారత్….అటు పాకిస్థాన్…రెండు దేశాల మీడియాలోనూ ఇప్పుడు ఒకటే ఇష్యూ. ఒకటే హాట్ టాపిక్… దాయాది దేశాలైన ఇండోపాక్ల ద్వైపాక్షిక సంబంధాల గురించో…తీవ్రవాద సమస్యల గురించో కాదు..చర్చలు….వాటన్నింటి కంటే సున్నితమైన కుటుంబ వ్యవహారం ప్రపంచ స్థాయిలో రచ్చకెక్కింది. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్…ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్టాల పెళ్లి ముచ్చటి గురించే అంతా. వివాదాలు వెంట లేకపోతే వాళ్లసలు సెలబ్రిటీలు ఎలా అవుతారు…వీళ్ల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఓసారి హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న షోయబ్…మరోసారి అదేఊరమ్మాయి వెంటపడ్డాడు. మొదటి భార్య ఆయేషా సిద్ధిఖీ తెరపైకి వచ్చి ఆధారాలు బయటపెట్టడంతో షోయబ్ నిఖానామా సాక్షిగా దొరికిపోయాడు..పాకిస్థాన్ వాళ్లను ఎంత వరకూ నమ్మొచ్చు….? భారత్,పాకిస్థాన్ సంబంధాలవిషయంలో ఆ దేశం ఎప్పుడూ అబద్దాలు చెబుతూనే ఉంటుంది. తీవ్రవాదుల్ని కట్టడి చేసే విషయంలో పాక్ చెప్పేవి అబద్దాలని ప్రపంచమంతా తెలుసు. ఇప్పుడు పాక్ క్రికెట్ కూడా అదే చేశాడా…? అబద్దాలతో ఇండియన్ను మోసం చేశాడా…? నిఖానామా పత్రాలను పాక్ మీడియానే బయటపెట్టింది. అయేషాతో తనకు పెళ్లి అయ్యిందని ఓ చానల్కు షోయబ్ ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా ఆ దేశ ఛానల్సే ప్రసారం చేశాయి. అయినా సరే.. మాజీ క్రికెటర్ నోరు మెదపడం లేదు. సో క్రికెట్ నిషేధాన్ని ఎదుర్కొంటూ…ఓ భార్య ఉండగానే మరో పెళ్లికి సిద్ధమైన ఈయనగారిని ఎవరు నమ్ముతారు….? మన సానియా తప్ప
క్యాలండర్
April 2024 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 తాజా వ్యాఖ్యలు
srinivas srigiri on మీడియాకు ఇదేం మాయరోగం మహిశ్రీ on కాంగ్రెస్ మార్క్ అసంతృప్తి Rajesh G on కార్పోరేట్ జర్నలిజం పండు on కార్పోరేట్ జర్నలిజం rayraj on కార్పోరేట్ జర్నలిజం ట్వీటుగాడు
Tweets by phanizee24నా పాత పోస్టులు